మార్కెట్లపై ఫెడ్‌ దెబ్బ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్ల లక్షల కోట్లు ఆవిరి..

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (డిసెంబర్ 19) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్‌లో విపరీతమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఉదయం సెన్సెక్స్-నిఫ్టీ భారీ పతనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2. 50 గంటలకు సెన్సెక్స్ 969 పాయింట్లు పతనమైంది, మరోవైపు నిఫ్టీ కూడా దాదాపు 247 పాయింట్లు పడిపోయి 23,944 స్థాయికి వచ్చింది. ఇంకోవైపు నిఫ్టీ బ్యాంక్ కూడా 660 పాయింట్లకు పైగా పడిపోయింది. నిప్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్‌ కూడా 260 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు