దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (జనవరి 2, 2025) భారీ లాభాల దిశగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.07 గంట సమయంలో సెన్సెక్స్ 1131 పాయింట్లు పెరిగి 79,637 స్థాయిలో ఉండగా, నిఫ్టీ కూడా 332 పాయింట్లు ఎగబాకి 24,075 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్లు పెరిగి 51,321 దగ్గర నడుస్తోంది. దీంతోపాటు నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 218 పెరిగి 57,669 పరిధిలో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని క్షణాల వ్యవధిలోనే 8 లక్షల కోట్ల రూపాయలకుపైగా దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఇదే సమయంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి సుజుకి, M&M, కోటక్ మహీంద్రా కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, బ్రిటానియా, సన్ ఫార్మా, BPCL, NTPC, భారత్ ఎలక్ట్రిక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఆటో, ఎన్బీఎఫ్సీ షేర్ల పెరుగుదల నుంచి మార్కెట్కు మద్దతు లభించింది. ప్రైవేట్ బ్యాంకుల షేర్లు కూడా మంచి లాభాలను నమోదు చేశాయి.
అదే సమయంలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రమే రెడ్లో ట్రేడవుతున్నాయి. అశోక్ లేలాండ్, ఎం అండ్ ఎం, మారుతీ, టాటా మోటార్స్ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీ, శ్రీరామ్ ఫైనాన్స్ నిఫ్టీ బుల్లిష్గా ఉన్నాయి. విప్రో, అదానీ ఎంటర్ప్రైజ్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీలలో క్షీణత కనిపించింది.
ఈ షేర్లు కూడా..
బీఎస్ఈలో గురువారం నాటి ట్రేడింగ్లో రైల్టెల్ కార్పొరేషన్ షేర్లు ఇంట్రాడే గరిష్టంగా రూ. 433.35 వద్ద 7 శాతం దూసుకెళ్లాయి. భారత్ కోకింగ్ కోల్ నుంచి కంపెనీ రూ.78.43 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్ను పొందడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఉదయం 9:43 గంటలకు రైల్టెల్ షేరు ధర 6.14 శాతం పెరిగి బీఎస్ఈలో ఒక్కో షేరుకు రూ.429.8కు చేరింది. CSB బ్యాంక్ షేర్ ధర ఈరోజు 6.2 శాతం పెరిగి బీఎస్ఈలో ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.333కి చేరుకుంది. ఈ రోజు ఉదయం డీల్స్లో బెంచ్మార్క్ BSE సెన్సెక్స్ 236 పాయింట్లు లేదా 0.3 శాతం పెరిగి 78,743 స్థాయిలకు చేరుకుంది. ప్రైవేట్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం (Q3FY25) బిజినెస్ అప్డేట్ను షేర్ చేసిన తర్వాత CSB బ్యాంక్ షేర్లు ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లాభపడ్డాయి.









