స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనాలనుకునే వారికి నిరాశే ఎదురైంది.  మళ్లీ ఇవాళ గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు కిందటి రోజుతో పోలిస్తే ఎగబాకాయి. దేశీయంగా బంగారం ధరలతో పాటుగా వెండి రేట్లు కూడా కిందటి రోజుతో పోలిస్తే పెరిగాయని చెప్పొచ్చు.

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 100 పెరగడంతో తులం ఇప్పుడు రూ. 73,400 కు చేరింది. దీనికి ముందు రోజు రూ. 100 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర రూ. 110 పెరగడంతో 10 గ్రాములకు రూ. 80,070 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 100 పెరిగి ఇప్పుడు రూ. 73,550 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ పుత్తడి ధర తులం రూ. 80,220 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరల విషయానికి వస్తే కిందటి రోజు రూ. 2000 తగ్గగా ఇవాళ మళ్లీ రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ నగరంలో రూ. 1000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 1.01 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1000 పెరగడంతో కేజీకి రూ. 93,500 కు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు దీనికి దోహదం చేస్తాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు