(మార్కెట్ కబుర్లు, హైదరాబాద్ )
రెండు నెలలుగా విదేశీ నిధులు స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి పోతున్నాయి. ఫోరన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎఫ్ ఐ ఐ) లు భారీ ఎత్తున తన పెట్టుబడులను భారత్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నారు. ఓవైపు మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా భారత ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆ పెట్టుబడుల ఉపసంహరణలు స్పష్టం చేస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్ లు నష్టాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
డిసెంబర్ 2024లో
డిసెంబర్ 2024లో, FIIs నికరంగా ₹4,533.49 కోట్లను మార్కెట్ల నుండి ఉపసంహరించుకున్నారు.
జనవరిలో
జనవరి 2025లో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. 2025 జనవరి 17 నాటికి, FIIs మొత్తం ₹46,576.06 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
కరెన్సీ పై ప్రభావం…
ఈ FIIs నిష్క్రమణ భారతీయ రూపాయి విలువ తగ్గడానికి కారణమైంది. 2025 జనవరి 15 నాటికి, రూపాయి అమెరికన్ డాలర్కు 86.5825 స్థాయికి చేరింది, ఇది చారిత్రక కనిష్ఠం.
ఇది చూసినపుడు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) ఈ కాలంలో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. వారు మార్కెట్లలోకి నిధులను కుమ్మరించి FII నిష్క్రమణల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించారు. జనవరి 2025లో DIIs మొత్తం ₹49,367.14 కోట్ల నికర కొనుగోళ్లు చేయడం గమనర్హం.









