వావ్‌.. ఆవుపేడ వ్యాపారమే.. కానీ లక్షల్లో సంపాదన..

యువత మంచి కెరీర్‌ను సంపాదించడానికి కష్టపడి పని చేస్తారు. చాలా పరీక్షలు రాయడం, వివిధ కోర్సులు చేస్తూ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్నిసార్లు కష్టపడి పనిచేయడం కంటే భిన్నమైన విధానం అవసరం. అలా భిన్నంగా ఏదైనా చేసే వ్యక్తులు మాత్రమే సమాజానికి కొత్త మార్గాలను చూపుతారు. ఇదే చేసింది నిషా జైస్వాల్. నిషా ఆవు పేడతో వ్యాపారాన్ని ప్రారంభించడమే కాకుండా, మంచి డబ్బు సంపాదిస్తూ, ఇతరులకు ఉపాధి కల్పిస్తోంది.

నిషా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా నివాసి. రేవాలోని సెంట్రల్ అకాడమీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. దీని తరువాత బి.కామ్ చేసి బ్యాంకింగ్ కోసం సిద్ధం కావడం ప్రారంభించింది. కానీ కొవిడ్ కాలంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. ఖాళీగా కూర్చోవడానికి బదులుగా వ్యాపారం చేయాలని అనుకుంది. అప్పుడు ఆమెకి ఆవు పేడతో ధూపం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది.

వచ్చిన వినూత్న ఆలోచనను ఆచరణలోకి తేవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఆవు పేడతో ధూపం తయారు చేయడం ప్రారంభించింది. దీనికి ఆమె సోదరుడు కూడా సహాయం చేశాడు. తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అనేక ప్రయత్నాల తర్వాత విజయం సాధించింది. కస్టమర్స్‌కి తన ఉత్పత్తుల పట్ల నమ్మకం కల్పించడానికి మార్కెట్లో ఉచిత నమూనాలను పంపిణీ చేసింది. అలా ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది.

మార్కెట్లో అమ్మే అగరుబత్తుల మాదిరిగా కాకుండా, అగరుబత్తులు పూర్తిగా సేంద్రీయంగా, బొగ్గు రహితంగా ఉండేవి. అందుకే జనాలకు ఇది బాగా నచ్చింది. డిమాండ్ పెరగడంతో, నిషా ధూపం తయారీ యంత్రాలను కొనుగోలు చేసి, ముగ్గురు కార్మికులను కూడా నియమించుకుంది.

పేడతో ధూపం తయారు చేసే వ్యాపారం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మంచి ఆదాయ వనరు కూడా. ఈ వ్యాపారం ద్వారా తాను ఒక సంవత్సరంలో మూడు లక్షల రూపాయలకు పైగా సంపాదించానని నిషా చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు