నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

భారత స్టాక్ మార్కెట్ సూచీలు  గురువారం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 24,300 కంటే దిగువకు పడిపోగా, సెన్సెక్స్ 315 పాయింట్లు నష్టపోయింది. HUL, భారతీ ఎయిర్‌టెల్, ఐషర్ మోటార్స్, ICICI బ్యాంక్, ఎటర్నల్ నిఫ్టీలో ప్రధాన నష్టాలను చవిచూడగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభపడ్డాయి. BSE మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌తో ముగియడంతో బ్రాడర్ సూచీలు ప్రధాన సూచీలను అధిగమించాయి. రంగాల విషయానికొస్తే, FMCG, రియాల్టీ ఒక్కొక్కటి 1 శాతం తగ్గాయి, ఫార్మా ఇండెక్స్ 1 శాతం పెరిగింది.

నేడు (ఏప్రిల్ 24న) నిఫ్టీ 24,300 కంటే దిగువకు చేరుకోవడంతో భారత ఈక్విటీ సూచీలు ప్రతికూలంగా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 315.06 పాయింట్లు లేదా 0.39 శాతం తగ్గి 79,801.43 వద్ద ఉంది. నిఫ్టీ 82.25 పాయింట్లు లేదా 0.34 శాతం తగ్గి 24,246.70 వద్ద స్థిరపడింది. ఫార్మా ఇండెక్స్ 1 శాతానికి పైగా ర్యాలీ తీసింది, అయితే రియాలిటీ, FMCG స్టాక్‌లలో లాభాల బుకింగ్ రావడంతో ఈ రెండు సూచీలు 1 శాతానికి పైగా పడిపోయాయి.

నిన్న ఐటీ, ఫార్మా, ఆటో రంగాలలో దూకుడుతో ఈ రెండు సూచీలు నెలల గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. అయితే, నిన్నటి బలమైన ర్యాలీ తర్వాత గురువారం మార్కెట్లలో క్షీణత సంభవించింది. పహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం కఠినంగా స్పందించిన తరువాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారుల సెంటిమెంట్ ప్రతికూలతకు దారితీసింది. ఇది ప్రాంతీయ స్థిరత్వం గురించి ఆందోళనలను రేకెత్తించింది.

దీనికి తోడు, మిశ్రమ ప్రపంచ సంకేతాలు, ఇంకా US-చైనా వాణిజ్య చర్చలపై అనిశ్చితి.. మార్కెట్ మానసిక స్థితిని తగ్గించడానికి దోహదపడ్డాయి. రంగాల వారీగా, FMCG, రియాల్టీ స్టాక్‌లు డీలా పడి ఇండెక్సుల మీద ప్రభావం చూపించాయి. ఇక, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ వంటి కొన్ని కౌంటర్లు లాభాలను చూశాయి .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share