హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కొత్త స్కీమ్.. నేటి నుంచే షురూ.. రూ.100 ఉన్నా చేరొచ్చు!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ, ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌‍సీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో కొత్త స్కీమ్ లాంచ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రిస్ ఐబీఎక్స్ ఫైనాన్షఇయల్ సర్వీసెస్ 3-6 మంత్స్ డెట్ ఇండెక్స్ ఫండ్ (HDFC Crisil IBX Financial Services 3-6 Months Debt Index Fund)పేరుతో ఈ కొత్త ఫండ్ తీసుకొచ్చింది. ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 28వ తేదీన మొదలవుతుంది. మే 5, 2025వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించారు. అంటే మీ వద్ద వంద ఉంటే ఇందులో చేరవచ్చు.

ఈ వారంలోనే మరో 3 కొత్త స్కీమ్స్..

హెచ్‌డీఎఫ్‌సీతో పాటు మరో 3 కొత్త స్కీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో డీఎస్‌పీ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (DSP Silver ETF FOF). ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 28వ తేదీన మొదలై మే 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులోనూ కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించింది. దీంతో పాటు వస్తున్న మరో స్కీమ్ యూటీఐ మల్టీక్యాప్ ఫండ్ (UTI Multicap Fund). ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏప్రిల్ 29న వస్తోంది. మే 13వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో కనీస పెట్టుబడిని రూ.1000గా నిర్ణయించారు.

ఇక మూడో స్కీమ్ మిరే మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తోంది. మిరే అసెట్ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిల్ ఈటీఎఫ్ (Mirae Asset Nifty 50 Equal Weight ETF). ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏప్రిల్ 30న ఓపెన్ అవుతోంది. మే 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share