ఆపరేషన్ సిందూర్ జోష్.. దూసుకెళ్లిన డిఫెన్స్ స్టాక్స్..

భారత్ ఆపరేషన్ సిందూర్ దిగ్విజయంగా పూర్తిచేసిందిత పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల దృష్టంతా డిఫెన్స్ స్టాక్స్ పై పడిందని చెప్పవచ్చు.  రక్షణ రంగానికి చెందిన ఈ స్టాక్స్  గత నెలలో 50 శాతానికిపైగా పెరగడమూ మదుపర్లను ఆకర్షిస్తోంది. ఈ కారణాలతో ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో డిఫెన్స్ సెక్టార్ కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. అయితే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కంపెనీల వద్ద పెద్ద ఆర్డర్లను కలిగి ఉన్నట్లు చెప్పారు. కానీ ఆదాయ, లాభాలు పెరగేందుకు 1-3 సంవత్సరాలు పడుతుందని, ఇప్పుడే కొనుగోలు చేయాలనుకోవడం తొందరపాటు అవుతుందని చెబుతున్నారు.

డిఫెన్స్ స్టాక్స్ పనితీరు

గత నెలలో డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన ప్రముఖ కంపెనీల షేర్లు 50 శాతం మేర ర్యాలీ చేశాయి. పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ (Paras Defence and Space Technologies Ltd) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత డేటా ప్యాటర్న్స్, డీసీఎక్స్ సిస్టమ్స్, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, ఆస్ట్రా మైక్రో వేవ్ ప్రొడక్ట్స్, మజగాం డాక్ షిప్‌ బిల్డర్స్ కంపెనీల షేర్లు 21- 35 శాతం వరకు పెరిగాయి. నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ ఏకంగా 16 శాతం పెరిగి అత్యుత్తమ పనితీరు కనబరిచింది.

డిఫెన్స్ స్టాక్స్ దాదాపు 4 శాతం వరకు పెరిగాయి. అందులో డేటా ప్యాటర్న్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మార్కెట్లు ప్రారంభమైన క్రమంలో 4 శాతం వరకు పెరిగింది. ఆ తర్వాత MTARటెక్నాలజీస్ 3.6 శాతం వరకు పెరిగింది. సియెంట్ డీఎల్ఎం (Cyient DLM), పరాస్ డిఫెన్స్ షేర్లు దాదాపు 2.50 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అలాగే గార్డెన్ రీసర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE), యూనిమెక్ ఎయిరో స్పేస్, మాన్యూఫాక్చరింగ్ షేర్లు 2 శాతం మేర రాణించాయి. ఇక భారత్ డైనమిక్స్, మెగజాన్ డాక్ షిప్ బిల్డర్స్ షేరు 1.7 శాతం మేర రాణించింది. ఇక కొచ్చిన షిప్ యార్డ్ షేరు 1.5 శాతం మేర పెరిగింది. హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ షేర్లు సైతం పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు