మంచి ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర..

బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి ఛాన్స్. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు సద్దుమణిగుతున్న క్రమంలో బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. వరుస సెషన్లలో పసిడి ధరలు దిగొస్తున్నాయి. శుక్రవారం తులం రేటు ఏకంగా రూ.2000 పైగా పడిపోయింది. వెండి సైతం మరో వెయ్యి దిగొచ్చింది.

భారత్‌లో బంగారం కొనుగోళ్లు ఏడాది పొడవునా ఉంటాయి. ప్రత్యేక రోజులు, పెళ్లిళ్ల సీజన్‌లో ఎక్కువ జరుగుతుంటాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, కొద్ది రోజులుగా సుంకాల అమలు వాయిదా వేయడం, వాణిజ్య ఒప్పందాలు కుదురుతుండడంతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. పెట్టుబడులు ఇతర మార్గాలకు మళ్లుతున్నాయి. దీంతో పసిడి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇది మహిళలకు అదిరే శుభవార్త అనే చెప్పాలి. ఈ క్రమంలో మే 16, 2025 రోజున హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎంతెంత పలుకుతున్నాయనేది  తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో బంగారం రేట్లు..
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. గత వారం రోజుల్లోనే తులం గోల్డ్ రేటు రూ.8000 వరకు దిగొచ్చింది. మధ్యలో ఒక్కరోజే కాస్త పెరిగింది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు మరో రూ.2130 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ. 93 వేల 930 స్థాయికి దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు రూ.1950 మేర పడిపోయింది. దీంతో తులం ధర రూ.86 వేల 100 వద్దకు దిగొచ్చింది.

మరో రూ.1000 తగ్గిన వెండి ధర..

బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా దిగొస్తోంది. వరుసగా మూడు రోజులుగా రూ.1000 చొప్పున తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు శుక్రవారం రూ.1000 తగ్గి రూ. 1,08,000 స్థాయికి దిగొచ్చింది.

అయితే ఈ కథనంలో చెప్పిన బంగారం, వెండి ధరలు మే 16వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. జీఎస్టీ వంటి ట్యాక్సులు కలిపి ధర లెక్కిస్తే ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. మీరు బంగారం కొనేందుకు వెళ్లే ముందు ధరలు తెలుసుకోవడం మంచిది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు