లక్ష మార్క్ దాటి బంగారం .. వెండి ధర తెలిస్తే షాకే..

బంగారం ధరలు నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల ఆల్‌టైమ్ హైకి చేరిన పసిడి ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ లక్ష మార్క్ దాటాయి.. అటు వెండి కూడా ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతోంది.. గోల్డ్, సిల్వర్ నాన్‌‌స్టాప్‌గా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జులై 20 2025 ఆదివారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,00,040, ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.91,700 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,16,000 గా ఉంది. అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

    1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ.1,00,040 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.91,700 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,26,000 గా ఉంది.
    2. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,00,040, 22 క్యారెట్ల ధర రూ.91,700 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,26,000 లుగా ఉంది.
    3. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,190, 22 క్యారెట్ల ధర రూ.91,850 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,16,000 లుగా ఉంది.
    4. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,040, 22 క్యారెట్ల ధర రూ.91,850 ఉంది. వెండి ధర కిలో రూ.1,16,000 గా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు