న్యూయర్ రోజు పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన బంగారం ధరలు

కొత్త సంవంత్సరం రోజున బంగారం ధరలు భారీగా పెరిగి షాకిచ్చాయి. బంగారం కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ముందునుంచి అంచనాలకు అనుగుణంగానే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో ధరలు(Gold Rate) మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నేటి నుంచే ధరలు పెరగడం ప్రారంభించాయి. రేపు కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ.. కిలో వెండి ధర లక్షకు చేరువలో ఉంది.

ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరకు.. రూ.400 మేర పెరిగి.. రూ.71,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారానికి రూ. 440 పెరిగి రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,500కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,500కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,000 కొనసాగుతోంది.

ఇక గుంటూరు, విశాఖపట్నంలో చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,500 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,650 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,150 పలుకుతోంది.

ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000కి చేరుకుంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు