బంగారం ధర ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. తులం ధర రూ. లక్షకు చేరువలో..

బంగారం ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌లో బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయలకు చేరుకోవచ్చని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ అనిశ్చితులు, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం పెట్టుబడిపై పెరుగుతున్న ఆందోళనలు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

భారతదేశంలో మంగళవారం బంగారం ధర ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.92,840 వద్ద కొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. అదే సమయంలో, 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ. 92,000 పైన చేరుకుంది. ఈ పెరుగుదలకు పెట్టుబడిదారుల ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయం కారణమని చెబుతున్నారు. దీని కారణంగా బంగారం ధరలు పెరిగాయి.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతోంది. MCXలో వెండి ధరలు కూడా పెరుగుదల ధోరణిని చూపించాయి. అయితే, ప్రస్తుతం దాని గరిష్ట స్థాయికి దగ్గరగా ట్రేడవుతోంది. అయితే మంగళవారం కిలో వెండిపై వెయ్యి రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలోవెండి ధర కిలోకు రూ.1,05,000 వద్ద కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో లక్షా 14 వేల వరకు ఉంది.

ముఖ్యంగా ఏప్రిల్‌లో బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయలకు చేరుకోవచ్చని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ అనిశ్చితులు, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం పెట్టుబడిపై పెరుగుతున్న ఆందోళనలు ఈ ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోశాయి. ఏప్రిల్‌లో ట్రంప్ రాబోయే సుంకాల అమలు కారణంగా ఆర్థిక మందగమనం ఏర్పడుతుందనే భయాలు బంగారం ధరలను మరింత పెంచవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అంటే మంగళవారం సాయంత్రానికి తులం బంగారంపై ఏకంగా రూ.930 వరకు పెరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు