స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన డిఫెన్స్ రంగంలోని కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ షేర్లు అదరగొట్టాయి. ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో 5 శాతానికి పైగా పెరిగి తమ షేర్ హోల్డర్లకు కాసులు కురిపించాయి. ఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజెషన్ (DRDO) నుంచి కొత్తగా ఆర్డర్ సొంతం చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించిన క్రమంలో మదుపరులు ఈ స్టాక్ కొనేందుకు మొగ్గు చూపారు. దీంతో ఈ కంపెనీ షేర్ భారీ ర్యాలీ చేసింది. మరోవైపు ఈ కంపెనీ షేరు ఐదేళ్లలో 1966 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్లో ఒకటిగా నిలిచింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ.20.66 లక్షలకుపైగా చేసింది.
కంపనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజెషన్ (డీఆర్డీఓ) నుంచి రూ. 7.52 కోట్ల కొత్త ఆర్డర్ పొందింది. అలాగే రూ. 11.48 కోట్ల విలువైన మరో ఆర్డర్కి అత్యల్ప బిడ్డర్గా ఎంపికైనట్లు కంపెనీ తెలిపింది. ఈ వివరాలు బహిర్గతం చేసిన క్రమంలో అపోలో మైక్రో సిస్టమ్స్ షేరు పరుగులు పెట్టింది. ఇవాళ మార్కెట్లు ముగిసే నాటికి ధర 4.46 శాతం లాభాపడి రూ. 117.70 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 157 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 87.99 వద్ద ఉంది.
వారం రోజుల్లో ఈ షేరు 7 శాతం లాభాన్ని ఇవ్వగా.. గత నెల రోజుల్లో చూస్తే 4 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 18 శాతం లాభాన్ని ఇచ్చింది. ఈ ఏడాది 2025లో ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం 2.5 శాతం మేర నష్టపోయింది. కానీ, గత ఏడాది కాలంలో చూస్తే ఈ షేరు 10 శాతం లాభపడింది. అదే గత ఐదేళ్ల కాలంలో ఈ షేరు 1966 శాతం మేర పెరిగి కాసులు కురిపించింది. ఐదేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగిన వారికి ఇప్పుడు రూ.20.66 లక్షల వరకు అందుతాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 3610 కోట్లుగా ఉంది.