బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 600 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 550 పెరిగింది. గోల్డ్ తోపాటు సిల్వర్ రేటు కూడా భారీగానే పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 18 డాలర్లు పెరిగింది. దీంతో శుక్రవారం ఉదయం ఔన్సు గోల్డ్ 3,334 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా గోల్డ్ రేటు పెరుగుతోంది. ఇదే పరిస్థితి ఉంటే ఈనెలాఖరు నాటికి గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీ పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.90,750కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 99,000కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,900కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 99,150కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.90,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 99,150కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,21,000 మార్క్ కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,21,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.